12. పండ్రెండవ అధ్యాయము

కుశ క్రౌంచ పుష్కరాది ద్వీపములు - రాహు సూర్య చంద్రుల ప్రమాణము.

సంజయ ఉవాచ
ఉత్తరేషు చ కౌరవ్య ద్వీపేషు శ్రూయతే కథా ।
ఏవం తత్ర మహారాజ బ్రువతశ్చ నిబోధ మే ॥ 1
సంజయుడు చెపుతున్నాడు.
"కౌరవ్యా! మహారాజ! శాకద్వీపం తరువాతి ద్వీపాల గురించి నేను విన్నంత చెపుతాను విను. (1)
ఘృతతోయః సముద్రోఽత్ర దధిమండోదకోఽపరః ।
సురోదః సాగరశ్చైవ తథాన్యో జలసాగరః ॥ 2
క్షీరసముద్రానికి ఆవల ఘృతోదక సముద్రం, దాని తరువాత దధి మండోదక సముద్రం, తరువాత సురోదక సముద్రం, మరొకటి జలసాగరం. (2)
పరస్పరేణ ద్విగుణాః సర్వే ద్వీపా నరాధిప ।
పర్వతాశ్చ మహారాజ సముద్రైః పరివారితాః ॥ 3
మహారాజా! ఈ సముద్రాలతో చుట్టబడిన ద్వీపాలన్నీ ఒకదాని కంటె ఒకటి ఉత్తరోత్తరం రెట్టింపు విస్తారం కలవి. (3)
గౌరస్తు మధ్యమే ద్వీపే గిరిర్మానః శిలో మహాన్ ।
పర్వతః పశ్చిమే కృష్ణే నారాయణసఖో నృప ॥ 4
రాజా! ఈ ద్వీపాలలో మధ్యద్వీపంలో మనశ్శిల (మణిశిల) పర్వతం ఉంది. గౌరపర్వతం అంటారు దాన్ని. అది పెద్దది. దానికి పడమర కృష్ణపర్వతం ఉంది. అది నారాయణునికి ఇష్టమైనది. (4)
తత్ర రత్నాని దివ్యాని స్వయం రక్షతి కేశవః ।
ప్రసన్నశ్చాభవత్ తత్ర ప్రజానం వ్యదధత్ సుఖమ్ ॥ 5
అక్కడి దివ్యరత్నాలన్నిటినీ కేశవుడే స్వయంగా రక్షిస్తాడు. కేశవు డక్కడ ప్రజలకు సుఖం కలిగిస్తూ ప్రసన్నుడై ఉంటాడు. (5)
కుశస్తంబః కుశద్వీపే మధ్యే జనపదైః సహ ।
సంపూజ్యతే శాల్మలిశ్చ ద్వీపే శాల్మలికే నృప ॥ 6
రాజా! కుశద్వీపం మధ్యలో పెద్ద కుశస్తంబం ఉంది. అలాగే శాల్మలి ద్వీపంలో శాల్మలి వృక్షం ఉంది. అక్కడి ప్రజలంతా వాటిని పూజిస్తారు. (6)
క్రౌంచద్వీపే మహాక్రౌంచః గిరీ రత్నచయాకరః ।
సంపూజ్యతే మహారాజ చాతుర్వర్ణ్యేన నిత్యదా ॥ 7
మహారాజా! క్రౌంచ ద్వీపంలో మహాక్రౌంచ మని పెద్ద పర్వతం ఉంది. అది రత్నరాసుల నిలయం. చతుర్వర్ణాలవారు దానిని నిత్యమూ పూజిస్తారు. (7)
గోమంతః పర్వతో రాజన్ సుమహాన్ సర్వధాతుకః ।
యత్ర నిత్యం నివసతి శ్రీమాన్ కమలలోచనః ॥ 8
మోక్షిభిః సంస్తుతో నిత్యం ప్రభూర్నారాయణో హరిః ।
రాజా! అక్కడి గోమంత పర్వతం పెద్దది. దాని మీద సర్వధాతువులూ ఉంటాయి. శ్రీహరి అక్కడ నిత్యనివాసి. కమలలోచనుడు, ప్రభువు, నారాయణుడు అయిన ఆయనను మోక్షార్థులు నిత్యమూ సేవిస్తుంటారు. (8)
కుశద్వీపే తు రాజేంద్ర పర్వతో విద్రుమైశ్చితః ॥ 9
సుధామా నామ దుర్ధర్షః ద్వితీయో హేమపర్వతః ।
రాజేంద్రా! కుశద్వీపంలో సుధామ అనే రెండవ బంగారు కొండ ఒకటి ఉంది. అది పగడాలగని. అది దుర్గమ మయినది. (9 1/2)
ద్యుతిమాన్ నామ కౌరవ్య తృతీయః కుముదో గిరిః ॥ 10
చతుర్థః పుష్పవాన్ నామ పంచమస్తు కుశేశయః ।
షష్ఠో హరిగిరిర్నామ షడేతే పర్వతోత్తమాః ॥ 11
కౌరవ్యా! అక్కడే కాంతిమంతమైన కుముదమనే మూడవ పర్వతం ఉంది. నాలుగవది పుష్పవంతం, అయిదవది కుశేశయం. ఆరవది హరిపర్వతం. కుశద్వీపంలో ఈ ఆరే పర్వతోత్తమాలు. (10,11)
తేషామంతరవిష్కంభః ద్విగుణః సర్వభాగశః ।
ఔద్భిదం ప్రథమం వర్షం ద్వితీయం వేణుమండలమ్ ॥ 12
వీటి మధ్యగల వైశాల్యం ఉత్తరోత్తరం రెట్టింపుగా ఉంటుంది. కుశద్వీపం యొక్క మొదటి వర్షం (దేశం) ఔద్భిదం. రెండవది వేణుమండల వర్షం. (12)
తృతీయం సురథాకారం చతుర్ధం కంబలం స్మృతమ్ ।
ధృతుమాన్ పంచమం వర్షం షష్ఠం వర్షం ప్రభాకరమ్ ॥ 13
మూడవది సురథాకార వర్షం. నాలుగవది కంబల వర్షం. అయిదవది ధృతిమంతం, ఆరవది ప్రభాకర వర్షం. (13)
సప్తమం కాపిలం వర్షం సప్తైతే వర్షలంభకాః ।
ఏతేషు దేవగంధర్వాః ప్రజాశ్చ జగతీశ్వర ॥ 14
విహరంతే రమంతే చ న తేషు మ్రియతే జనః ।
న తేషు దస్యవః సంతి మ్లేచ్ఛజాత్యోఽపి వా నృప ॥ 15
ఏడవది కాపిలవర్షం. రాజా! ఈ ఏడు వర్షాలలోను దేవ, గంధర్వులు, మనుష్యులు విహరిస్తూ ఉంటారు. వారిలో ఎవరూ చనిపోరు. అక్కడ దొంగ లుండరు. మ్లేచ్ఛులుండరు. (14,15)
గౌరప్రాయో జనః సర్వః సుకుమారశ్చ పార్థివ ।
అవశిష్టేషు సర్వేషు వక్ష్యామి మనుజేశ్వర ॥ 16
రాజా! జనులందరూ తెల్లని శరీరాలతో సుకుమారులై ఉంటారు. మిగిలిన ద్వీపాల గురించి ఇపుడు చెపుతాను. (16)
యథాశ్రుతం మహారాజ తదవ్యగ్రమనాః శృణు ।
క్రౌంచద్వీపే మహారాజ క్రౌంచో నామ మహాగిరిః ॥ 17
క్రౌంచాత్ పరో వామనకః వామనాదంధకారకః ।
అంధకారాత్ పరో రాజన్ మైనాకః పర్వతోత్తమః ॥ 18
మైనాకాత్ పరతో రాజన్ గోవిందో గిరిరుత్తమః ।
గోవిందాత్ పరతో రాజన్ నిబిడో నామ పర్వతః ॥ 19
రాజా! నేను విన్నంత చెపుతాను. ప్రశాంతంగా విను. క్రౌంచ ద్వీపంలో మహాక్రౌంచ పర్వతం. దానికి ఆవల వామన పర్వతం, దాని తరువాత అంధకార పర్వతం. దాని కావల మైనాకం, దాని అవతల గోవింద పర్వతం, గోవిందం కంటె తరువాత నిబిడ పర్వతం ఉన్నాయి. (17-19)
పరస్తు ద్విగుణస్తేషాం విష్కంభో వంశవర్ధన ।
దేశాంస్తత్ర ప్రవక్ష్యామి తన్మే నిగదతః శృణు ॥ 20
వంశవర్ధనా! వీని మధ్యభాగ వైశాల్యం ఒకటికంటె ఒకటి ఉత్తరోత్తరం రెట్టింపుగా ఉంది. అక్కడున్న దేశాలపేర్లు చెపుతాను, విను. (20)
క్రౌంచస్య కుశలో దేశః వామనస్య మనోనుగః ।
మనోనుగాత్ పరశ్చోష్ణః దేశః కురుకులోద్వహ ॥ 21
కురుకులోద్వహా! క్రౌంచ పర్వత సమీపంలో కుశలదేశం, వామన పర్వత సమీపంలో మనోనుగదేశం, దాని కవతల ఉష్ణదేశం ఉన్నాయి. (21)
ఉష్ణాత్ పరః ప్రావరకః ప్రావారాదంధకారకః ।
అంధకారకదేశాత్ తు మునిదేశః పరః స్మృతః ॥ 22
ఉష్ణదేశానికి ఆవల ప్రావరకం, ప్రావారం తరువాత అంధకారక దేశం, దాని కవతల మునిదేశం ఉన్నాయి. (22)
మునిదేశాత్ పరశ్చైవ ప్రోచ్యతే దుందుభిస్వనః ।
సిద్ధచారణసంకీర్ణః గౌరప్రాయో జనాధిప ॥ 23
ఏతే దేశా మహారాజ దేవగంధర్వసేవితాః ।
మహారాజా! మునిదేశం కంటె తరువాత దుందుభిస్వనదేశం ఉంది. ఈ దేశంలో సిద్ధులూ , చారణులూ ఉంటారు. అక్కడి జనులు తెల్లగా ఉంటారు. అన్నిటిలోనూ దేవతలు, గంధర్వులూ నివసిస్తారు. (23 1/2)
పుష్కరే పుష్కరే నామ పర్వతో మణిరత్నవాన్ ॥ 24
పుష్కర ద్వీపంలో పుష్కర పర్వతం ఉంది. దాని మీద ఎన్నో రత్నాలున్నాయి. (24)
తత్ర నిత్యం ప్రభవతి స్వయం దేవః ప్రజాపతిః ।
తం పర్యుపాసతే నిత్యం దేవాః సర్వే మహర్షయః ॥ 25
వాగ్భిర్మనోఽనుకూలాభిః పూజయంతో జనాధిప ।
రాజా! అక్కడ ప్రజాపతి అయిన బ్రహ్మ నిత్యమూ - కనిపిస్తాడు. అక్కడి దేవతలూ, మహర్షులూ అందరూ స్తోత్రం చేస్తూ అనుకూల వాక్కులతో పూజిస్తూ సేవిస్తారు. (25 1/2)
జంబూద్వీపాత్ ప్రవర్తంతే రత్నాని వివిధాన్యుత ॥ 26
ద్వీపేషు తేషు సర్వేషు ప్రజానాం కురుసత్తమ ।
బ్రహ్మచర్యేణ సత్యేన ప్రజానాం హి దమేన చ ॥ 27
ఆరోగ్యాయుః ప్రమాణాభ్యాం ద్విగుణం ద్విగుణం తతః ।
కురుసత్తమా! జంబూద్వీపం నుండి వివిధ రత్నాలు ఇతర ద్వీపాలకు పంపబడతాయి. బ్రహ్మచర్యం, సత్యం, దమం - వీటి వల్ల ఆ ద్వీపాలలోని ప్రజల ఆయుః ప్రమాణం జంబూ ద్వీపంలోని వారికంటె రెట్టింపు రెట్టింపు పెరుగుతుంది. (26,27 1/2)
ఏకో జనపదో రాజన్ ద్వీపేష్వేతేషు భారత ।
ఉక్తా జనపదా యేషు ధర్మశ్చైకః ప్రదృశ్యతే ॥ 28
రాజా! భారతా! ఈ దేశాలన్నిటిలోనూ ఒకే జనపదం ఉంది. అనేక జన పదాలున్న ద్వీపాల్లో కూడ ఒకే విధంగా ధర్మం కనబడుతుంది. (28)
ఈశ్వరో దండముద్యమ్య స్వయమేవ ప్రజాపతిః ।
ద్వీపానేతాన్ మహారాజ రక్షంస్తిష్ఠతి నిత్యదా ॥ 29
మహారాజా! ప్రజాపతి (బ్రహ్మ) స్వయంగా దండం చేపట్టి నిత్యమూ ఈ ద్వీపాలను రక్షిస్తాడు. (29)
స రాజా స శివో రాజన్ స పితా ప్రపితామహః ।
గోపాయతి నరశ్రేష్ఠ ప్రజాః సజడపండితాః ॥ 30
నరోత్తమా! రాజా! ప్రజాపతి ఆ ద్వీపాలకు రాజు.అతడే కళ్యాణ ప్రదుడు. తండ్రిగా, ప్రపితామహుడుగా ఆయన మూఢుల నుండి పండితుల దాకా ప్రజలందరినీ రక్షిస్తున్నాడు. (30)
భోజనం చాత్ర కౌరవ్య ప్రజాః స్వయముపస్థితమ్ ।
సిద్ధమేవ మహాబాహో తద్ధి భుంజంతి నిత్యదా ॥ 31
కౌరవ్యా! మహాబాహూ! వండి సిద్ధపరచిన భోజనం ప్రజల దగ్గరకు అక్కడ స్వయంగా వస్తుంది. అదే రోజూ ప్రజలు తింటారు. (31)
తతః పరం సమా నామ దృశ్యతే లోకసంస్థితిః ।
చతురస్రం మహారాజ త్రయస్త్రింశత్ తు మండలమ్ ॥ 32
మహారాజా! దానికి ఆవల 'సమా అనే ప్రదేశం ఉంది. అది చతురస్రంగా ఉంటుంది. అందులో ముప్పది మూడు మండలాలు ఉన్నాయి. (32)
తత్ర తిష్ఠంతి కౌరవ్య చత్వారో లోకసమ్మతాః ।
దిగ్గజా భరతరశ్రేష్ఠ వామనైరావతాదయః ॥ 33
కౌరవ్యా! భరతశ్రేష్ఠా! అక్కడే లోకప్రసిద్ధి చెందిన వామనం, ఐరావతం, సుప్రతీకం, అంజనమనే నాలుగు దిగ్గజాలు ఉంటాయి. (33)
సుప్రతీకస్తథా రాజన్ ప్రభిన్నకరటాముఖః ।
తస్యాహం పరిమాణం తు న సంఖ్యాతుమిహోత్సహే ॥ 34
అసంఖ్యాతః స నిత్యం హి తిర్యగూర్ధ్వమధస్తథా ।
వాటిలో సుప్రతీకం యొక్క గంఢస్థలం నుండి మదజలం స్రవిస్తుంది.
సుప్రతీకం యొక్క పరిమాణం చాలా పెద్దది. అందుచేత 'ఇంత' అని దాని ఎత్తుకాని, లావుకాని చెప్పలేను. (33,34 1/2)
తత్ర వై వాయవో వాంతి దిగ్భ్యః సర్వాభ్య ఏవ హి ॥ 35
అసంబద్ధా మహారాజ తాన్ నిగృహ్ణంతి తే గజాః ।
పుష్కరైః పద్మసంకాశైః వికసద్భిర్మహాప్రభైః ॥ 36
శతధా పునరేవాశు తే తాన్ ముంచంతి నిత్యశః ।
శ్వసద్భిర్ముచ్యమానాస్తు దిగ్గజైరిహ మారుతాః ॥ 37
ఆగచ్ఛంతి మహారాజ తతస్తిష్ఠంతి వై ప్రజాః ।
మహారాజా! అక్కడ అన్ని దిక్కుల నుండి ధారాళంగా వాయువు వీస్తుంది. దాన్ని దిగ్గజాలు గ్రహించి ఆపి ఉంచుతాయి. పద్మాల వలె కాంతిమంతాలైన తొండాల అగ్రభాగం నుండి ఆ వాయువును వందల కొద్ధీ భాగాలుగా విభజించి. అన్ని దిక్కులకూ వదలుతాయి. ఆ వాయువులే ప్రజల జీవితాలను ధరిస్తాయి." (35-37 1/2)
ధృతరాష్ట్ర ఉవాచ
పరో వై విస్తరోఽత్యర్థం త్వయా సంజయ కీర్తితః ॥ 38
దర్శితం ద్వీపసంస్థానమ్ ఉత్తరం బ్రూహి సంజయ ।
ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. "సంజయా! ద్వీపాల పరిస్థితిని విస్తారంగా చెప్పావు. తరువాతి విషయం చెప్పు." (38 1/2)
సంజయ ఉవాచ
ఉక్తా ద్వీపా మహారాజ గ్రహం వై శృణు తత్త్వతః ॥ 39
స్వర్భానోః కౌరవశ్రేష్ఠ యావదేవ ప్రమాణతః ।
పరిమండలో మహారాజ స్వర్భానుః శ్రూయతే గ్రహః ॥ 40
సంజయుడిలా అన్నాడు. "మహారాజా! ద్వీపాలను గురించి చెప్పాను. ఇక రాహువును గూర్చి విను. రాహువు యొక్క ప్రమాణం, దాని మండలాకారం గురించి విన్నది చెపుతాను. (39,40)
యోజనానాం సహస్రాణి విష్కంభో ద్వాదశాస్యవై ।
పరిణాహేన షట్త్రింశద్ విపులత్వేన చానఘ ॥ 41
అనఘా! రాహువు యొక్క వ్యాసం పన్నెండు వేల యోజనాలు. దాని పరిధి ముప్పది ఆరువేల యోజనాలు. (41)
షష్టిమాహుః శతాన్యస్య బుధాః పౌరాణికాస్తథా ।
చంద్రమాస్తు సహస్రాణి రాజన్నేకాదశ స్మృతః ॥ 42
రాజా! రాహువు లావును గూర్చి పౌరాణికులు ఆరు వేల యోజనాలని చెపుతారు. చంద్రుని వ్యాసం పదకొండు వేల యోజనాలని చెప్పబడింది. (42)
విష్కంభేణ కురుశ్రేష్ఠ త్రయస్త్రింశత్ తు మండలమ్ ।
ఏకోనషష్టివిష్కంభం శీతరశ్మేర్మహాత్మనః ॥ 43
కురుశ్రేష్ఠా! మహాత్ముడైన చంద్రుని పరిధి ముప్పది మూడు వేల యోజనాలు. వైశాల్యం ఏబది తొమ్మిదివేల యోజనాలు. (43)
సూర్యస్త్వష్టౌ సహస్రాణి ద్వే చాన్యే కురునందన ।
విష్కంభేణ తతో రాజన్ మండలం త్రింశతా సమమ్ ॥ 44
అష్టపంచాశతం రాజన్ విపులత్వేన చానఘ ।
శ్రూయతే పరమోదారః పతగోఽసౌ విభావసుః ॥ 45
కురునందనా! రాజా! సూర్యుని వ్యాసం పదివేల యోజనాలు. పరిధి ముప్పది వేల యోజనాలు. వైపుల్యం ఏబది ఎనిమిది వేల చదరపు యోజనాలు. రాజా! ఈ రీతిగా పరమోదారుడు, వేగశాలి అయిన సూర్యుని పరిమాణం వినబడుతోంది. (44,45)
ఏతత్ ప్రమాణమర్కస్య నిర్దిష్టమిహ భారత ।
స రాహుశ్ఛాదయత్యేతౌ యథాకాలం మహత్తయా ॥ 46
చంద్రాదిత్యౌ మహారాజ సంక్షేపోఽయముదాహృతః ।
ఇత్యేతత్ తే మహారాజ పృచ్ఛతః శాస్త్రచక్షుషా ॥ 47
సర్వముక్తం యథాతత్త్వం తస్మాచ్ఛమమవాప్నుహి ।
మహారాజా! సూర్యుని ప్రమాణం ఇలా నిర్దేశింపబడింది. రాహువు సూర్యచంద్రుల కన్న ఆకారంలో పెద్ద కాబట్టి యథాకాలంగా సూర్యచంద్రులను కప్పివేస్తూ ఉంటాడు. శాస్త్రదృష్టితో సంక్షేపంగా చెప్పాను. నీవింక శాంతి పొందు. (46,47 1/2)
యథోద్దిష్టం మయా ప్రోక్తం సనిర్మాణమిదం జగత్॥ 48
తస్మాదాశ్వస కౌరవ్య పుత్రం దుర్యోధనం ప్రతి ।
కౌరవ్యా! నీ వడిగినట్లు ఈ జగన్నిర్మాణం గురించి చెప్పాను. నీ వింక దుర్యోధనుని గురించి నిశ్చితంగా ఉండు. (48 1/2)
శ్రుత్వేదం భరతశ్రేష్ఠ భూమిపర్వ మనోఽనుగమ్ ॥ 49
శ్రీమాన్ భవతి రాజన్యః సిద్ధార్థః సాధుసమ్మతః ।
ఆయుర్బలం చ కీర్తిశ్చ తస్య తేజశ్చ వర్ధతే ॥ 50
భరతశ్రేష్ఠా! ఈ భూమిపర్వం గురించి ఏకాగ్ర మనస్సుతో విన్న రాజు సంపన్నుడూ, సాధు సమ్మతుడూ అవుతాడు. అతనికి ఆయువూ, బలమూ, కీర్తి, తేజస్సు వృద్ధి పొందుతాయి. అర్థసిద్ధి కలుగుతుంది. (49,50)
యః శృణోతి మహీపాల పర్వణీదం యతవ్రతః ।
ప్రీయంతే పితరస్తస్య తథైవ చ పితామహాః ॥ 51
రాజా! పర్వకాలంలో దీన్ని నియత వ్రతంతో విన్నవాని పితృపితామహులు సంప్రీతి చెందుతారు. (51)
ఇదం తు భారతం వర్షం యత్ర వర్తామహే వయమ్ ।
పూర్వైః ప్రవర్తితం పుణ్యం తత్ సర్వం శ్రుతవానసి ॥ 52
ఇదీ భారత వర్షం యొక్క విశేషం. ఇక్కడే మనం ఉంటున్నాం. పూర్వులు పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇపుడు నీవు విన్నావు. (52)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భూమిపర్వణి ఉత్తరద్వీపాదిసంస్థానవర్ణనే ద్వాదశోఽధ్యాయః ॥ 12 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భూమిపర్వమను ఉపపర్వమున ఉత్తర ద్వీపాది సంస్థాన వర్ణన మను పండ్రెండవ అధ్యాయము.