4. నాలుగవ అధ్యాయము
సంజయుడు భూమి మహత్త్వమును వర్ణించుట.
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా యయౌ వ్యాసః ధృతరాష్ట్రాయ ధీమతే ।
ధృతరాష్ట్రోఽపి తచ్ఛ్రుత్వా ధ్యానమేవాన్వపద్యత ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు.
ధీమంతుడయిన ధృతరాష్ట్రునికి ఇలా చెప్పి, వ్యాసుడు వెళ్లిపోయాడు. అదంతా విని, ధృతరాష్ట్రుడు ఆలోచనలో పడ్డాడు. (1)
స ముహూర్తమివ ధ్యాత్వా వినిఃశ్వస్య మహుర్ముహుః ।
సంజయం సంశితాత్మానమ్ అపృచ్ఛద్ భరతర్షభ ॥ 2
ఒక్కక్షణం ఆలోచించి, మాటిమాటికి నిట్టూరుస్తూ, మనసు నదుపు చేసికొనగల సంజయినితో ఇలా అన్నాడు. (2)
సంజయేన మహీపాలాః శూరా యుద్ధాభినందినః ।
అన్యోన్యమభినిఘ్నంతి శస్త్రైరుచ్చావచైరిహ ॥ 3
పార్థివాః పృథివీహేతోః సమభిత్యజ్య జీవితమ్ ।
న వా శామ్యంతి నిఘ్నంతః వర్ధయంతి యమక్షయమ్ ॥ 4
భౌమమైశ్వర్యమిచ్ఛంతః న మృష్యంతే పరస్పరమ్ ।
మన్యే బహుగుణా భూమిః తన్మమాచక్ష్వ సంజయ ॥ 5
"సంజయా! యుద్ధాన్నే కోరుతూ రాజులంతా భూమికోసం జీవితాలు పోయినా సరే పరస్పరం చంపుకొంటారు. వారికి శాంతి లేదు. ఒకరినొకరు సహింపరు. భూమిమీద ఐశ్వర్యం కోసం పరస్పరం చంపుకొని యమలోకంలో జనసంఖ్యను పెంచుతారు. కాని భూమిలో అనేక గుణాలున్నాయని నా అభిప్రాయం - వాటిని నాకు చెప్పు. (3-5)
బహూని చ సహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ।
కోట్యశ్చ లోకవీరాణాం సమేతాః కురుజాంగలే ॥ 6
ఈ కురుక్షేత్రంలో వేలు, లక్షలు కోట్లు మంది వీరులంతా చేరి ఉన్నారు. (6)
దేశానాం చ పరీమాణం నగరాణాం చ సంజయ ।
శ్రోతుమిచ్ఛామి తత్త్వేన యత ఏతే సమాగతాః ॥ 7
సంజయా! వీరు వచ్చిన దేశాలు, నగరాల పరిమాణాన్ని యథాతథంగా వినగోరుతున్నాను. (7)
దివ్యబుద్ధిప్రదీపేన యుక్తస్త్వం జ్ఞానచక్షుషా ।
ప్రభావాత్ తస్య విప్రర్షేః వ్యాసస్యామితతేజసః ॥ 8
అమితతేజస్వి అయిన వ్యాసుని ప్రభావంతో నీకు జ్ఞాననేత్రం ఇవ్వబడింది. ఆ దివ్యబుద్ధి అనే దీపంతో/వెలుగుతో నాకు చెప్పు." (8)
సంజయ ఉవాచ
యథాప్రజ్ఞం మహాప్రాజ్ఞ భౌమాన్ వక్ష్యామి తే గుణాన్ ।
శాస్త్రచక్షురవేక్షస్వ నమస్తే భరతర్షభ ॥ 9
సంజయుడు చెపుతున్నాడు.
"మహాప్రాజ్ఞా! నాకు తెలిసినంతలో భూమ్ యొక్క గుణాలు చెపుతాను. నీవు శాస్త్ర దృష్టితో వివేచించి, తెలుసుకో. (9)
ద్వివిధానీహ భూతాని చరాణి స్థావరాణి చ ।
త్రసానాం త్రివిధా యోనిః అండ స్వేదజరాయుజాః ॥ 10
ప్రపంచంలోని భూతాలు చరాలు అచరాలు అని రెండు విధాలు. చరాల్లో మళ్లీ 1. అండజాలు 2.స్వేదజాలు 3.జరాయుజాలు అని మూడు విధాలు. (10)
వి॥ చరాలు = జంగమాలు
స్థావరాలు = అచరాలు
జరాయువు = స్త్రీ యొక్క గర్భకోశం
త్రసానాం ఖలు సర్వేషాం శ్రేష్ఠా రాజన్ జరాయుజాః ।
జరాయుజానాం ప్రవరాః మానవాః పశవశ్చ యే ॥ 11
రాజా! ఈ చరాల్లో జరాయుజాలు శ్రేష్ఠాలు. జరాయుజాల్లో మనుష్యులు, పశువులు ఉత్తమాలు. (11)
త్రసాలు = చరాలు
నానారూపధరా రాజన్ తేషాం భేదాశ్చతుర్దశ ।
వేదోక్తాః పృథివీపాల యేషు యజ్ఞాః ప్రతిష్ఠితాః ॥ 12
రాజా! జరాయుజాలు చాలా ఆకారాల్లో ఉంటాయి. పదునాల్గుభేదాలు అని వేదం. ఈ జరాయుజాల్లోనే యజ్ఞాలు ప్రతిష్ఠితాలయిఉన్నాయి.(12)
గ్రామ్యాణాం పురుషాః శ్రేష్ఠాః సింహాశ్చారణ్యవాసినామ్ ।
సర్వేషామేవ భూతానామ్ అన్యోన్యేనోపజీవనమ్ ॥ 13
గ్రామాల్లోని జరాయుజాల్లో మానవులు శ్రేష్ఠులు. అడవులలోని జరాయుజాల్లో సింహాలు శ్రేష్ఠాలు. ప్రాణులన్నిటి జీవితమూ పరస్పర సహకారంతో సాగుతుంది. (13)
ఉద్భిజ్జాః స్థావరాః ప్రోక్తాః తేషాం పంచైవ జాతయః ।
వృక్షగుల్మలతావల్ల్యః త్వక్సారాస్తృణజాతయః ॥ 14
ఉద్భిజ్జములే స్థావరాలు. వానిలో అయుదే జాతులు, వృక్షాలు, పాదలు, లతలు, వల్లులు, త్వక్సారాలు (వెదుళ్లు) - ఇవి తృణ జాతులని కూడా అంటారు. (14)
తేషాం వింశతిరేకోనా మహాభూతేషు పంచసు ।
చతుర్వింశతిరుద్దిష్టా గాయత్రీ లోకసమ్మతా ॥ 15
ఈ స్థావరాలూ, జంగమాలూ మొత్తం పందొమ్మిది. వీటికి పంచభూతాలు కలిపితే మొత్తం ఇరవై నాలుగు. గాయత్రీ మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలున్నాయి. వీటికి కూడా గాయత్రి అనే పేరు ఉంది. (15)
య ఏతాం వేద గాయత్రీం పుణ్యాం సర్వగుణాన్వితామ్ ।
తత్త్వేన భరతశ్రేష్ఠ స లోకే న ప్రణశ్యతి ॥ 16
భరతశ్రేష్ఠా! సకల గుణాలతో నిండి పుణ్యప్రదమైన ఈ గాయత్రిని తాత్త్వికంగా తెలుసుకొన్న వారు ఎన్నడూ నష్టపడరు. (16)
అరణ్యవాసినః సప్త సప్తైషాం గ్రామవాసినః ।
సింహా వ్యాఘ్రా వరాహాశ్చ మహిషా వారణాస్తథా ॥ 17
ఋక్షాశ్చ వానరాశ్చైవ సప్తారణ్యాః స్మృతా నృప ।
రాజా! ఇంతకు ముందు చెప్పిన పదునాలుగు జరాయుజాల్లో అడవి పశుజాతులు ఏడు. గ్రామాల్లో ఉండే పశుజాతులు ఏడు. సింహాలు పెద్దపులులు, అడవి పందులు, అడవి దున్నలు, ఏనుగులు, భల్లూకాలు, కోతులు ఇవి అరణ్య వాసులు. (17 1/2)
గౌరజావిమనుష్యాశ్చ అశ్వాశ్వతరగర్దభాః ॥ 18
ఏతే గ్రామ్యాః సమాఖ్యాతాః పశవః సప్త సాధుభిః ।
ఏతే వై పశవో రాజన్ గ్రామ్యారణ్యాశ్చతుర్దశ ॥ 19
రాజా! ఇక ఆవులు, మేకలు, గొర్రెలు, మనుష్యులు గుర్రాళు, కంచర గాడిదలు, అనేవి గ్రామంలోనివి. అడవిలోనివి ఏడు, గ్రామాల్లోనివి ఏడు మొత్తం పదునాలుగు జాతులు. (18,19)
భూమౌ చ జాయతే సర్వం భూమౌ సర్వం వినశ్యతి ।
భూమిః ప్రతిష్ఠా భూతానాం భూమిరేవ పరాయణమ్ ॥ 20
అన్నీ భూమిమీదనే పుడతాయి. భూమి మీదనే నశిస్తాయి. భూమియే అన్నిటికీ స్థానమూ, ఆశ్రయమూ, పరాగతి. (20)
యస్య భూమిస్తస్య సర్వం జగత్ స్థావరజంగమమ్ ।
తత్రాతిగృద్ధా రాజానః వినిఘ్నంతీతరేతరమ్ ॥ 21
ఈ భూమి ఎవని ఏలుబడిలో ఉంటుందో అతని అధీనంలోనే స్థావర జంగమాలన్నీ ఉంటాయి. ఈ భూమి మీది ఆసక్తి సహజంగా రాజులకు ఎక్కువగా ఉంటుంది. దాని కోసం వారు ఒకరినొకరు చంపుకొంటారు." (21)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి భౌమగుణకథనే ప్రథమోఽధ్యాయః ॥ 4 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున జంబూఖండవినిర్మాణ పర్వమను ఉపపర్వమున భూమిగుణముల వర్ణనము అను నాల్గవ అధ్యాయము. (4)