6. ఆరవ అధ్యాయము

సుదర్శన ద్వీప విశేష వర్ణనము.

ధృతరాష్ట్ర ఉవాచ
ఉక్తో ద్వీపస్య సంక్షేపః విధివద్ బుద్ధిమంస్త్వయా ।
తత్త్వజ్ఞశ్చాసి సర్వస్య విస్తరం బ్రూహి సంజయ ॥ 1
ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు. "బుద్ధిమంతుడా! సంక్షేపంగా ద్వీపం గురించ్ చెప్పావు. నీవు తత్త్వ మెరిగినవాడవు. సర్వమూ విస్తారంగా చెప్పు సంజయా! (1)
యావాన్ భూమ్యవకాశోఽయం దృశ్యతే శశలక్షణే ।
తస్య ప్రమాణం ప్రబ్రూహి తతో వక్ష్యసి పిప్పలమ్ ॥ 2
చంద్రునిలోని కుందేలు చిహ్నంలో భూమి ఎంత ఉన్నది? దాని అవకాశమెంత? పిప్పలాన్ని గూర్చి తరువాత చెప్పు." (2)
వైశంపాయన ఉవాచ
ఏవం రాజ్ఞా స పృష్టస్తు సంజయో వాక్యమబ్రవీత్ ।
వైశంపాయనుడు చెపుతున్నాడు.
రాజు అలా అడిగే సరికి సంజయుడు ఇలా ఆరంభించాడు.
సంజయ ఉవాచ
ప్రాగాయతా మహారాజ షడేతే వర్షపర్వతాః ।
అవగాఢా హ్యుభయతః సముద్రౌ ప్ర్వపశ్చిమౌ ॥ 3
"సుదర్శన ద్వీపంలో తూర్పు నుండి పడమటి వరకు ఆరు వర్షపర్వతాలున్నాయి. అవి తూర్పు పశ్చిమ సముద్రాలలోకి చొచ్చుకొని ఉన్నాయి. (3)
హిమవాన్ హేమకూటశ్చ నిషధశ్చ నగోత్తమః ।
నీలశ్చ వైదూర్యమయః శ్వేతశ్చ శశిసంనిభః ॥ 4
సర్వధాతువిచిత్రశ్చ శృంగవాన్ నామ పర్వతః ।
ఏతే వై పర్వతా రాజన్ సిద్ధచారణసేవితాః ॥ 5
రాజా! హిమవంతం, హేమకూటం, మేటికొండ అయిన నిషధం, వైడూర్యమణి మయమైన నీలగిరి, చంద్రుని వంటి శ్వేతగిరి, సర్వధాతువులతో విచిత్రమైన శృంగవంతం - ఈ ఆరు పర్వతలూ సిద్ధులకూ, చారణులకూ నివాసాలు. (4,5)
ఏషామంతరవిష్కంభః యోజనాని సహస్రశః ।
తత్ర పుణ్యా జనపదాః తాని వర్షాణి భారత ॥ 6
ఈ వర్ష పర్వతాల నడిమి ప్రదేశం వేల యోజనాల విస్తీర్ణం ఉంటుంది. అక్కడ ఎన్నో భూఖండాలు ఉన్నాయి. వాటిని వర్షాలంటారు. వాటిలో ఎన్నో పుణ్యప్రదేశాలున్నాయి. (6)
వసంతి తేషు సత్త్వాని నానాజాతీని సర్వశః ।
ఇదం తు భారతం వర్షం తతో హైమవతం పరమ్ ॥ 7
ఈ వర్షాల్లో ఎన్నో జాతుల వారు నివసిస్తున్నారు. వీటిలో భారత వర్షం ఒకటి. దీని తరువాత హిమాలయానికి ఉత్తరంగా హైమవత వర్షం ఉంది. (7)
హేమకూటాత్ పరం చైవ హరివర్షం ప్రచక్షతే ।
దక్షిణేన తు నీలస్య నిషధస్యోత్తరేణ తు ॥ 8
ప్రాగాయతో మహాభాగ మాల్యవాన్ నామ పర్వతః ।
తతః పరం మాల్యవతః పర్వతో గంధమాదనః ॥ 9
హేమకూటం దాటాక హరివర్షం ఉంది. మహాభాగా! నీలగిరికి దక్షిణంగాను, నిషధ పర్వతానికి ఉత్తరంగాను తూర్పు నుండి పడమటివైపుగా మాల్యవంతం అనే పర్వతం ఉంది. దానికి తరువాత గంధ మాదన పర్వతం ఉంది. (8,9)
పరిమండలస్తయోర్మధ్యే మేరుః కనకపర్వతః ।
ఆదిత్యతరుణాభాసః విధూమ ఇవ పావకః ॥ 10
ఈ రెండు పర్వతాల మధ్య దేశంలో బంగారు మేరు పర్వతం గుండ్రంగా ఉంది. ఈ పర్వతం లేత సూర్యుని వలె, పొగలేని అగ్నివలె ప్రకాశిస్తూ ఉంటుంది. (10)
యోజనానాం సహస్రాణి చతురశీతిరుచ్ఛ్రితః ।
అధస్తాచ్చతురశీతిః యోజనానాం మహీపతే ॥ 11
రాజా! మేరు పర్వతం ఎత్తు ఎనభై నాలుగు వేల యోజనాలు. అది భూమిలోకి కూడ అంతే లోతు వ్యాపించి ఉంది. (11)
ఊర్ధ్వమధశ్చ తిర్యక్ చ లోకానావృత్య తిష్ఠతి ।
తస్య పార్శ్వేష్వమీ ద్వీపాః చత్వారః సంస్థితా విభో ॥ 12
రాజా! పైన, క్రింద, అన్ని ప్రక్కలా కూడా మేరుపర్వతం వ్యాపించి ఉంది. దీని పార్శ్వాలలోనే ఈ నాల్గుద్వీపాలున్నాయి. (12)
భద్రాశ్వః కేతుమాలశ్చ జంబూద్వీపశ్చ భారత ।
ఉత్తరాశ్చైవ కురవః కృతపుణ్యప్రతిశ్రయాః ॥ 13
భారతా! వాటిపేర్లు 1. భద్రాశ్వ, 2. కేతుమాల 3. జంబూద్వీప 4. ఉత్తర కురుద్వీపాలు. ఈ ఉత్తర కురు ద్వీపంలో పుణ్యాత్ములు నివసిస్తారు. (13)
విహగః సుముఖో యస్తు సువర్ణస్యాత్మజః కిల ।
స వై విచింతయామాస సౌవర్ణాన్ వీక్ష్య వాయసాన్ ॥ 14
మేరురుత్తమమధ్యానామ్ అధమానాం చ పక్షిణామ్ ।
అవిశేషకరో యస్మాత్ తస్మాదేనం త్యజామ్యహమ్ ॥ 15
ఒకప్పుడు సుపర్ణుని కొడుకు సుముఖుడు మేరు పర్వతం మీద బంగారు కాకులను చూశాడు. "ఈ మేరు పర్వతం మీద పక్షులలో ఉత్తమ మధ్యమ అధమ భేదం తెలియదు. అందుచేత ఈ పర్వతం త్యజిస్తున్నాను" అని సుముఖుడు వెళ్లిపోయాడు అక్కడి నుండి. (14,15)
తమాదిత్యోఽనుపర్యేతి సతతం జ్యోతిషాం వరః ।
చంద్రమాశ్చ సనక్షత్రః వాయుశ్చైవ ప్రదక్షిణః ॥ 16
గ్రహశ్రేష్ఠుడయిన సూర్యుడు, నక్షత్రాలతో సహా చంద్రుడు, వాయువు సదా ఆ పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. (16)
స పర్వతో మహారాజ దివ్యపుష్పఫలాన్వితః ।
భవనైరావృతః సర్వైః జాంబూనదపరిష్కృతైః ॥ 17
మహారాజా! ఆ పర్వతం దివ్యమైన పుష్పఫలాలతో ఉంటుంది. బంగారు భవనాలతో నిండి ఉంటుంది. (17)
తత్ర దేవగణా రాజన్ గంధర్వాసురరాక్షసాః ।
అప్సరోగణసంయుక్తాః శైలే క్రీడంతి సర్వదా ॥ 18
రాజా! ఆ కొండపై దేవతలు, గంధర్వులు, రాక్షసులు, అసురులు, అప్సరోగణాలతో సదా క్రీడిస్తూ ఉంటారు. (18)
తత్ర బ్రహ్మా చ రుద్రశ్చ శక్రశ్చాపి సురేశ్వరః ।
సమేత్య వివిధైర్యజ్ఞైః యజంతేఽనేకదక్షిణైః ॥ 19
అక్కడ బ్రహ్మ, రుద్రుడు, సురేశ్వరుడైన ఇంద్రుడు సమకూడి భూరి దక్షిణలతో వివిధ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. (19)
తుంబురుర్నారదశ్చైవ విశ్వావసుర్హహా హుహూః ।
అభిగమ్యామరశ్రేష్ఠాన్ తుష్టువుర్వివిధైః స్తవైః ॥ 20
తుంబురుడు, నారదుడు, విశ్వావసువు, హాహా, హుహూ మొ॥ గంధర్వులు దేవశ్రేష్ఠుల వద్దకు వెళ్లి, అనేక స్తోత్రాలు చేస్తారు. (20)
సప్తర్షయో మహాత్మానః కశ్యపశ్చ ప్రజాపతిః ।
తత్ర గచ్ఛంతి భద్రం తే సదా పర్వణి పర్వణి ॥ 21
ప్రతీ పర్వకాలంలోనూ మహాత్ములయిన సప్తర్షులు, కశ్యపప్రజాపతి అక్కడకు వస్తారు. నీకు మేలు కలుగుగాక! (21)
తస్యైవ మూర్ధన్యుశనాః కావ్యో దైత్యైర్మహీపతే ।
ఇమాని తస్య రత్నాని తస్యేమే రత్నపర్వతాః ॥ 22
రాజా! ఆ మేరు పర్వత శిఖరం మీదనే శుక్రుడు రాక్షసులతో నివసిస్తూ ఉంటాడు. ఈ రత్నాలు, ఈ రత్న పర్వతాలూ అతనివే. (22)
తస్మాత్ కుబేరో భగవాన్ చతుర్థం భాగమశ్నుతే ।
తతః కలాంశం విత్తస్య మనుష్యేభ్యః ప్రయచ్ఛతి ॥ 23
ఈ మేరు పర్వత సంపదలో నాల్గవ భాగం కుబేర భగవానుడు పొందుతాడు. దానిలో పదహారో వంతు కుబేరుడు మనుష్యులకు ఇస్తాడు. (23)
పార్శ్వే తస్యోత్తరే దివ్యం సర్వర్తుకుసుమైశ్చితమ్ ।
కర్ణికారవనం రమ్యం శిలాజాలసముద్గతమ్ ॥ 24
దానికి ఉత్తర దిక్కున శిలాసమూహాల నుండి ఉద్భవించిన కర్ణికార వనం ఉంది. దివ్యరమణీయమైన అది అన్ని ఋతువుల పుష్పాలతోనూ నిండుగా ఉంటుంది. (24)
తత్ర సాక్షాత్ పశుపతిః దివ్యైర్భూతైః సమావృతః ।
ఉమాసహాయో భగవాన్ రమతే భూతభావనః ॥ 25
కర్ణికారమయీం మాలాం బిభ్రత్వాదావలంబినీమ్ ।
త్రిభిర్నేత్రైః కృతోద్యోతః త్రిభిః సూర్యైరివోదితైః ॥ 26
ఈ కర్ణికార వనంలోనే శివుడు పొడవైన గన్నేరు పూలదండను ధరించి, ఉమాదేవితో విహరిస్తూ ఉంటాడు. ముగ్గురు సూర్యులు ఒకేసారి ఉదయించినట్లు మూడు నేత్రాల నుండి తేజస్సును ప్రసరిస్తూ ఉంటాడు. (25,26)
తముగ్రతపసః సిద్ధా సువ్రతాః సత్యవాదినః ।
పశ్యంతి న హి దుర్వృత్తైః శక్యో ద్రష్టుం మహేశ్వరః ॥ 27
ఆ మహేశ్వరుని తపస్వులు, సిద్ధులు, సువ్రతులు, సత్యవాదులు మాత్రమే దర్శించగలరు. దుష్టులు మహేశ్వరుని చూడలేరు. (27)
తస్య శైలస్య శిఖరాత్ క్షీరధారా నరేశ్వర ।
విశ్వరూపాపరిమితా భీమనిర్ఘాతనిఃస్వనా ॥ 28
పుణ్యా పుణ్యతమైర్జుష్టా గంగా భాగీరథీ శుభా ।
ప్లవంతీవ ప్రవేగేన హ్రదే చంద్రమసః శుభే ॥ 29
రాజా! ఈ మేరు పర్వత శిఖరం నుండి గంగానది ప్రవహించి చంద్రకుండంలో పడుతుంది పిడుగులా శబ్దిస్తూ ఆ ప్రవాహం పాలవంటి తెల్లని ధారలతో పరిమితి లేని విశ్వరూపంతో, తీవ్రవేగంతో ఎగసిపడుతున్నట్లు శుభకరమైన ఆ భాగీరథి శుభప్రదమైన ఆ చంద్రకుండంలో పడుతుంది. దాన్ని పరమ పుణ్యాత్ములు సేవిస్తారు. (28,29)
తయా హ్యుత్పాదితః పుణ్యః స హ్రదః సాగరోపమః ।
తాం ధారయామాస తదా దుర్ధరాం పర్వతైరపి ॥ 30
శతం వర్షసహస్రాణాం శిరస్యైవ పినాకధృక్ ।
సాగరంలా ఉండే ఆ చంద్రకుండం గంగవల్లనే ఉద్భవించింది. అది పుణ్యప్రదం. ఆ కుండాన్ని పర్వతాలు కూడా ధరించలేకపోయాయి. అపుడు శంకరుడు లక్ష సంవత్సరాలు తల మీద ధరించాడు. (30 1/2)
మేరోస్తు పశ్చిమే పార్శ్వే కేతుమాలో మహీపతే ॥ 31
జంబూఖండస్తు తత్రైవ సుమహాన్ నందనోపమః ।
ఆయుర్దశ సహస్రాణి వర్షాణాం తత్ర భారత ॥ 32
రాజా! మేరు పర్వతానికి పశ్చిమాన కేతుమాలద్వీపం ఉంది. అక్కడే నందనవనం లాంటి పెద్ద జంబూఖండం ఉంది. అక్కడ నివసించే వారికి పదివేల సంవత్సరాల ఆయువు ఉంటుంది. (31,32)
సువర్ణవర్ణాశ్చ నరాః స్త్రియశ్చాప్సరసోపమాః ।
అనామయా వీతశోకాః నిత్యం ముదితమానసాః ॥ 33
అక్కడి పురుషులు బంగారు చాయ శరీరం కలిగి ఉంటారు. స్త్రీలు అప్సరసల వలె ఉంటారు. అందరూ రోగం కాని, దుఃఖం కాని లేకుండా సదా సంతోషంతో ఉంటారు. (33)
జాయంతే మానవాస్తత్ర నిష్టప్తకనకప్రభాః ।
గంధమాదనశృంగేషు కుబేరః సహ రాక్షసైః ॥ 34
సంవృతోఽప్సరసాం సంఘైః మోదతే గుహ్యకాధిపః ।
అక్కడి వారికి పుటం పెట్టిన బంగారు కాంతి గల పిల్లలు పుడతారు. గంధమాదన శిఖరాల మీద గుహ్యకాధిపతియైన కుబేరుడు రాక్షసులతో కూడి అప్సరసల సంఘాలను చుట్టూ నిలుపుకొని ప్రమోదిస్తూ ఉంటాడు. (34 1/2)
గంధమాదనపాదేషు పరేష్వపరగండికాః ॥ 35
ఏకాదశ సహస్రాణి వర్షాణాం పరమాయుషః ।
ఆ గంధమాదన పర్వతం యొక్క పాదభాగంలో నీటి బుడగల వంటి పాషాణాలు ఎన్నో ఉన్నాయి. అక్కడి వారి ఆయువు పదకొండు వేల సంవత్సరాలు ఉంటుంది. (35 1/2)
తత్ర హృష్టా నరా రాజన్ తేజోయుక్తా మహాబలాః ।
స్త్రియశ్చోత్పలవర్ణాభాః సర్వాః సుప్రియదర్శనాః ॥ 36
రాజా! అక్కడి పురుషులు మహా బలవంతులై తేజస్వులై ఉంటారు. స్త్రీలంతా పద్మపత్రాల వంటి తేజస్సుతో చూడముచ్చటగా ఉంటారు. (36)
నీలాత్ పరతరం శ్వేతం శ్వేతాద్ధైరణ్యకం పరమ్ ।
వర్షమైరావతం రాజన్ నానాజనపదావృతమ్ ॥ 37
నీలపర్వతానికి ఉత్తరాన శ్వేతవర్షమూ, శ్వేతవర్షానికి ఉత్తరాన హిరణ్యకవర్షమూ ఉన్నాయి. దాని తరువాత ఐరావత వర్షం ఉంది. అది ఎన్నో జనపదాలతో నిండి ఉంటుంది. (37)
ధనుఃసంస్థే మహారాజ ద్వే వర్షే దక్షిణోత్తరే ।
ఇలావృతం మధ్యమం తు పంచ వర్షాణి చైవ హి ॥ 38
రాజా! దక్షిణంలో భారత వర్షమూ, ఉత్తరాన ఐరావత వర్షమూ ఉన్నాయి. ఈ రెండూ ధనుస్సు యొక్క రెండు కొనలవలె ఉంటాయి. ఈ వర్షాల మధ్య శ్వేత, హిరణ్యక, ఇలావృత, హరివర్ష, హైమవతాలనే అయిదు వర్షాలున్నాయి. వీటి మధ్యనే ఇలావృత వర్షం ఉంది. (38)
ఉత్తరోత్తరమేతేభ్యః వర్షముద్రిచ్యతే గుణైః ।
ఆయుఃప్రమాణమారోగ్యం ధర్మతః కామతోఽర్థతః ॥ 39
భారత వర్షం నుండి ఈ వర్షాలన్నీ ఆయువులో, ఆరోగ్యంలో, ధర్మంలో, అర్థంలో కామంలోనూ ఒక దాన్ని మించి మరొకటి ఉంటాయి. (39)
సమన్వితాని భూతాని తేహు వర్షేషు భారత ఏవమేషా మహారాజ పర్వతైః పృథివీ చితా ॥ 40
భారతా! మహారాజా! ఈ వర్షాలన్నిటిలోని జనులూ స్నేహభావంతో ఉంటారు. ఇలా ఈ భూమి అంతా పర్వతాలతో కూడి ఉంది. (40)
హేమకూటస్తు సుమహాన్ కైలాసో నామ పర్వతః ।
యత్ర వైశ్రవణో రాజన్ గుహ్యకైః సహ మోదతే ॥ 41
రాజా! విశాలమైన హేమకూట పర్వతమే కైలాసం అని ప్రసిద్ధి చెందింది. అక్కడ కుబేరుడు గుహ్యకులతో కలిసి ఆనందంగా ఉంటాడు. (41)
అస్త్యుత్తరేణ కైలాసం మైనాకం పర్వతం ప్రతి ।
హిరణ్యశృంగః సుమహాన్ దివ్యో మణిమయో గిరిః ॥ 42
కైలాసానికి ఉత్తరంలో మైనాక పర్వతం ఉంది. దానికి ఉత్తరంగా హిణ్యశృంగం ఉంది. అది మణిమయమైన మహాపర్వతం. (42)
తస్య పార్శ్వే మహద్ దివ్యం శుభ్రం కాంచనవాలుకమ్ ।
రమ్యం బిందుసరో నామ యత్ర రాజా భగీరథః ॥ 42
ద్రష్టుం భాగీరథీం గంగామ్ ఉవాస బహులాః సమాః ।
హిరణ్య శృంగానికి ప్రక్కనే దివ్యమై, రమణీయమైన బిందుసరోవరం ఉంది. అది విశాలమై బాంగారు వన్నె ఇసుకతో నిండి ఉంటుంది. ఇక్కడే పూర్వం భగీరథుడు గంగానది కోసం ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు. (43 1/2)
యూపా మణిమయాస్తత్ర చైత్యాశ్చాపి హిరణ్మయాః ॥ 44
తత్రేష్ట్వా తు గతః సిద్ధిం సహస్రాక్షో మహాయశాః ।
ఈ బిందుసరోవరతీరంలోనే మణి మయా లైన యూపస్తంభాలూ, బంగారు భవనాలూ ఉన్నాయి. అక్కడే మహాయశస్వి అయిన ఇంద్రుడు యజ్ఞాలు చేసి సిద్ధిపొందాడు. (44 1/2)
స్రష్టా భూతపతిర్యత్ర సర్వలోకైః సనాతనః ॥ 45
ఉపాస్యేత తిగ్మతేజాః యత్ర భూతైః సమంతతః ।
నరనారాయణౌ బ్రహ్మా మనుః స్థాణుశ్చ పంచమః ॥ 46
అక్కడే అన్నివైపులా ప్రపంచవాసులంతా సనాతనుడు, మహాతేజస్వి, సృష్టికర్త, భూతపతి అయిన మహాదేవుని అర్చిస్తారు. అక్కడే నరనారాయణులు, బ్రహ్మ, మనువు, శివుడు ఈ అయిదుగురూ ఉంటారు. (45,46)
తత్ర దివ్యా త్రిపథగా ప్రథమం తు ప్రతిష్ఠితా ।
బ్రహ్మలోకాదపక్రాంతా సప్తధా ప్రతిపద్యతే ॥ 47
దివ్య గంగానది మొదట బ్రహ్మలోకం నుండి దిగి మొదట బిందుసరోవరంలోనే నిలిచింది. అక్కడి నుండే ఏడు ధారలుగా ప్రవహించింది. (47)
వస్వోకసారా నలినీ పావనీ చ సరస్వతీ ।
జంబూనదీ చ సీతా చ గంగా సింధుశ్చ సప్తమీ ॥ 48
1. వస్వోకసార 2. నలిని 3. సరస్వతి 4. జంబూనది 5. సీత 6. గంగ 7. సింధు అనే ఏడు నదులుగా ప్రవహించింది. (48)
అచింతా దివ్యసంకాశా ప్రభోరేషైవ సంవిధిః ।
ఉపాసతే యత్ర సత్రం సహస్రయుగపర్యయే ॥ 49
ఈ ఏడూ భగవంతుని అనూహ్యమైన దివ్యసుందర విధానం అని తెలుసుకో. ఈ ప్రదేశాల్లో ప్రజలు వేలయుగాలు యజ్ఞాలతో పరమాత్మను ఉపాసిస్తారు. (49)
దృశ్యాదృశ్యా చ భవతి తత్ర తత్ర సరస్వతీ ।
ఏతా దివ్యాః సప్తగంగాః త్రిషు లోకేషు విశ్రుతాః ॥ 50
ఈ ఏడు ధారాలలో సరస్వతీనది కొన్ని చోట్ల కనపడుతుంది. కొన్ని చోట్ల కనపడదు. ఈ సప్తగంగలూ త్రిలోక ప్రఖ్యాతి వహించాయి. (50)
రక్షాంసి వై హిమవతి హేమకూటే తు గుహ్యకాః ।
సర్వా నాగాశ్చ నిషధే గోకర్ణం చ తపోవనమ్ ॥ 51
ఇక హిమవత్పర్వతం మీద రాక్షసులు, హేమకూట పర్వతం మీద గుహ్యకులు, నిషధ పర్వతం మీద సర్పాలు, నాగులు నివసిస్తారు. గోకర్ణం సాక్షాత్తు తపోవనమే. (51)
దేవాసురాణాం సర్వేషాం శ్వేతపర్వత ఉచ్యతే ।
గంధర్వా నిషధే నిత్యం నీలే బ్రహ్మర్షయస్తథా ।
శృంగవాంస్తు మహారాజ దేవానాం ప్రతిసంచరః ॥ 52
మహారాజా! దేవాసురులందరికీ శ్వేతపర్వతం నివాసం. నిషధగిరి మీద గంధర్వులు, నీలగిరి మీద బ్రహ్మర్షులు నివసిస్తారు. శృంగవంతం దేవతల సంచారస్థానం. (52)
ఇత్యేతాని మహారాజ సప్త వర్షాణి భాగశః ।
భూతాన్యుపనివిష్టాని గతిమంతి ధ్రువాణి చ ॥ 53
ఈ విధంగా స్థావర జంగమాత్మకమైన ప్రాణులన్నీ ఈ ఏడు పర్వతాలను ఆశ్రయించుకొని, విభజించుకొని ఉన్నాయి. (53)
తేషామృద్ధిర్బహువిధా దృశ్యతే దైవమానుషీ ।
అశక్యా పరిసంఖ్యాతుం శ్రద్ధేయా తు బభూషతా ॥ 54
వీరి వృద్ధి దైవమని, మానుషమని రెండు విధాలుగా కనిపిస్తోంది. వాటిని లెక్కింపలేము. శ్రేయఃకాములు ఆ వృద్ధిని నమ్మాలి. (54)
(స వై సుదర్శనద్వీపః దృశ్యతే శశవద్ ద్విధా) ।
యాం తు పృచ్ఛసి మాం రాజన్ దివ్యామేతాం శశాకృతిమ్ ।
పార్శ్వే శశస్య ద్వే వర్షే ఉక్తే యే దక్షిణోత్తరే ।
కర్ణౌ తు నాగద్వీపశ్చ కాశ్యపద్వీప ఏవ చ ॥ 55
ఇలా నీకు సుదర్శన ద్వీప వృత్తాంతమంతా చెప్పాను. ఆ ద్వీపం రెండు భాగాలుగా విభజింపబడి చంద్రునిలో కుందేలు రూపంగా ప్రతి ఫలిస్తోంది. నీవు కుందేలు ఆకృతిని గూర్చి ప్రశ్నించావు కదా చెపుతున్నాను. (55)
తామ్రవర్ణః శిరో రాజన్ శ్రీమాన్ మలయపర్వతః ।
ఏతద్ ద్వితీయం ద్వీపస్య దృశ్యతే శశసంస్థితమ్ ॥ 56
దక్షిణోత్తర దిక్కులలో ఉన్న భారత, ఐరావత ద్వీపాలు రెండూ కుందేటికి రెండు పార్శ్వాలు. నాగ ద్వీప - కాశ్యప ద్వీపాలు రెండూ కుందేటికి రెండు చెవులు. ఎర్రగా వృక్షాలతో ఉండే మలయ పర్వతమే కుందేటి శిరస్సు. ఇలా సుదర్శన ద్వీపం యొక్క రెండో భాగమే చంద్రమండలంలో కుందేలు ఆకారంలో కనిపిస్తోంది." (56)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి భూమ్యాదిపరిమాణవివరణే షష్ఠోఽధ్యాయః ॥ 6 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున జంబూఖండవినిర్మాణ పర్వమను ఉపపర్వమున భూమ్యాది పరిమాణము అను ఆరవ అధ్యాయము. (6)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి 56 1/2 శ్లోకాలు)