7. ఏడవ అధ్యాయము
ఉత్తరుకురు, భద్రాశ్వ వర్ష, మాల్యవంతముల వర్ణనము.
ధృతరాష్ట్ర ఉవాచ
మేరోరథోత్తరం పార్శ్వం పూర్వం చాచక్ష్వ సంజయ ।
నిఖిలేన మహాబుద్ధే మాల్యవంతం చ పర్వతమ్ ॥ 1
ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు.
"సంజయా! మహాపతీ! మేరు పర్వతానికి ఉత్తరాన పూర్వభాగాన ఉన్న వాటిని గురించి, అలాగే మాల్యవత్పర్వతాన్ని గురించి పూర్తిగా చెప్పు." (1)
సంజయ ఉవాచ
దక్షిణేన తు నీలస్య మేరోః పార్శ్వే తథోత్తరే ।
ఉత్తరాః కురవో రాజన్ పుణ్యాః సిద్ధనిషేవితాః ॥ 2
సంజయుడు చెపుతున్నాడు.
"రాజా! నీలగిరికి దక్షిణంగా, మేరు పర్వతానికి ఉత్తరంగా ఉత్తర కురువర్షం ఉంది. అది పుణ్య ప్రదమయినది. దాన్ని సిద్ధులు సేవిస్తారు. (2)
తత్ర వృక్షాః మధుఫలాః నిత్యపుష్పఫలోపగాః ।
పుష్పాణి చ సుగంధీని రసవంతి ఫలాని చ ॥ 3
అక్కడి వృక్షాలు నిత్యమూ పుష్పాలతో మధు ఫలాలతో నిండి ఉంటాయి. పూలు సువాసనా భరితాలు, ఫలాలు రసవంతాలు. (3)
సర్వకామఫలాస్తత్ర కేచిద్ వృక్షా జనాధిప ।
అపరే క్షీరిణో నామ వృక్షాస్తత్ర నరాధిప ॥ 4
యే క్షరంతి సదా క్షీరం షడ్రసం చామృతోపమమ్ ।
వస్త్రాణి చ ప్రసూయంతే ఫలేష్వాభరణాని చ ॥ 5
రాజా! అక్కడ కొన్ని చెట్లు కోరిన ఫలాలిస్తాయి. మరికొన్ని పాలచెట్లు - వాటి నుండి పాలు కారుతూ ఉంటాయి. అవి షడ్రసోపేతంగా, అమృత తుల్యంగా ఉంటాయి. ఆ చెట్లు కొన్ని వస్త్రాలిస్తాయి. కొన్న పళ్లు, ఆభరణాల నిస్తాయి. (4,5)
సర్వా మణిమయీ భూమిః సూక్ష్మకాంచనవాలుకా ।
సర్వర్తుసుఖసంస్పర్శా నిష్పంకా చ జనాధిప ।
పుష్కరిణ్యః శుభాస్తత్ర సుఖస్పర్శా మనోరమాః ॥ 6
రాజా! భూమి అంతా మణిమయంగా ఉంటుంది. అక్కడి ఇసుకరేణువులు బంగారపురజను. అన్ని ఋతువులలోను సుఖస్పర్శ ఉంటుంది. బురద ఉండదు. అక్కడి సరోవరాలు మనోహరంగా సుఖస్పర్శతో శుభకరంగా ఉంటాయి. (6)
దేవలోకచ్యుతాః సర్వే జాయంతే తత్ర మానవాః ।
శుక్లాభిజనసంపన్నాః సర్వే సుప్రియదర్శనాః ॥ 7
దేవలోకం నుండి పుణ్యం తరిగి పడిన మానవులు అక్కడ పుడతారు. స్వచ్ఛమైన వంశంలో పుట్టి, చూడ ముచ్చటగా ఉంటారు. (7)
మిథునాని చ జాయంతే స్త్రియశ్చాప్సరసోపమాః ।
తేషాం తే క్షీరిణాం క్షీరం పిబంత్యమృతసన్నిభమ్ ॥ 8
స్త్రీ పురుషులక్కడ జంటలుగా కూడా పుడతారు. స్త్రీలంతా అప్సరసల్లా ఉంటారు. వారు పాలచెట్ల నుండి అమృత తుల్యమయిన పాలు త్రాగుతారు. (8)
మిథునం జాయతే కాలే సమం తచ్చ ప్రవర్ధతే ।
తుల్యరూపగుణోపేతం సమవేషం తథైవ చ ॥ 9
అక్కడి జంటలు ఏకకాలంలో పుడతారు. కలిసి పెరుగుతారు. సమమైన రూపగుణాలూ, వేషమూ కలిగి ఉంటారు. (9)
ఏకైకమనురక్తం చ చక్రవాకసమం విభో ।
నిరామయాశ్చ తే లోక్యాః నిత్యం ముదితమానసాః ॥ 10
రాజా! చక్రవాక పక్షులవలె ఒకరి యందు ఒకరు అనురక్తులయి ఉంటారు. నిత్యమూ రోగరహితులై, సంతృప్తితో, సంతోషంతో ఉంటారు. (10)
దశ వర్షసహస్రాణి దశ వర్షశతాని చ ।
జీవంతి తే మహారాజ న చాన్యోన్యం జహత్యుత ॥ 11
అలా ఆ జంటలు పదకొండు వేల సంవత్సరాలు అన్యోన్యంగా జీవిస్తారు. ఒకరినొకరు విడిచిపెట్టరు. (11)
భారుండా నామ శకునాః తీక్ష్ణతుండా మహాబలాః ।
తాన్ నిర్హరంతీహ మృతాన్ దరీషు ప్రక్షిపంతి చ ॥ 12
అక్కడ మహాబలం గల భారుండాలనే పక్షులుంటాయి. వాటి ముక్కులు తీక్ష్ణంగా ఉంటాయి. అవి శవాలను ఎత్తుకొని పోయి గుహలలో పడవేస్తాయి. (12)
ఉత్తరాః కురవో రాజన్ వ్యాఖ్యాతాస్తే సమాసతః ।
మేరోః పార్శ్వమహం పూర్వం వక్ష్యామ్యథ యథాతథమ్ ॥ 13
రాజా! సంగ్రహంగా ఉత్తర కురుదేశం గురించి చెప్పాను. ఇపుడు మేరువుకు ఉత్తరంగా ఉన్న భద్రాశ్వ వర్షాన్ని గురించి యథాతథంగా చెపుతాను. (13)
తస్య మూర్ధాభిషేకస్తు భద్రాశ్వస్య విశాంపతే ।
భద్రసాలవనం యత్ర కాలామ్రశ్చ మహాద్రుమః ॥ 14
రాజా! భద్రాశ్చ వర్ష శిఖరం మీద భద్రసాలమనే పేరుగల వనం ఉంది. అందులో కాలామ్రం అనే పెద్ద చెట్టు ఉంది. (14)
కాలామ్రస్తు మహారాజ నిత్యపుష్పఫలః శుభః ।
ద్రుమశ్చ యోజనోత్సేధః సిద్ధచారణసేవితః ॥ 15
మహారాజా! ఆ చెట్టు ఒక యోజనం ఎత్తు ఉంటుంది. అది సదా పుష్పఫలాలతో నిండి శుభ ప్రదంగా ఉంటుంది. సిద్ధులూ, చారణులూ దాన్ని సేవిస్తూ ఉంటారు. (15)
తత్ర తే పురుషాః శ్వేతాః తేజోయుక్తా మహాబలాః ।
స్త్రియః కుముదవర్ణాశ్చ సుందర్యః ప్రియదర్శనాః ॥ 16
అక్కడి పురుషులు తెల్లగా, తేజస్వులై, మహాబలవంతులై ఉంటారు. స్త్రీలు బంగారు చాయతో చూడ ముచ్చటగా, అందంగా ఉంటారు. (16)
చంద్రప్రభాశ్చంద్రవర్ణాః పూర్ణచంద్రనిభాననాః ।
చంద్రశీతలగాత్య్రశ్చ నృత్యగీతవిశారదాః ॥ 17
ఆ స్త్రీలు వెన్నెల కాంతితో, చంద్ర వర్ణంతో, పున్నమి చంద్రుని వంటి ముఖాలు కలిగి ఉంటారు. చంద్రుని వలె చల్లని శరీరంతో నృత్యగీత విశారదలై ఉంటారు. (17)
దశ వర్షసహస్రాణి తత్రాయుర్భరతర్షభ ।
కాలామ్రరసపీతాస్తే నిత్యం సంస్థితయౌవనాః ॥ 18
భరతశ్రేష్ఠా! అక్కడి వారి ఆయువు పదివేల సంవత్సరాలు. వారు కాలామ్రరసం (నల్లని మామిడి పండురసం) త్రాగి, నిత్యయౌవనులై ఉంటారు. (18)
దక్షిణేన తు నీలస్య నిషధస్యోత్తరేణ తు ।
సుదర్శనో నామ మహాన్ జంబూవృక్షః సనాతనః ॥ 19
నీలగిరికి దక్షిణంగా, నిషధగిరికి ఉత్తరంగా సుదర్శన మనే పెద్ద జంబూవృక్షం ఉంది. అది చాలా సనాతనమైనది. (19)
సర్వకామఫలః పుణ్యః సిద్ధచారణసేవితః ।
తస్య నామ్నా సమాఖ్యాతః జంబూద్వీపః సనాతనః ॥ 20
అది కోరికలు తీర్చేది. పుణ్యప్రదమైనది. సిద్ధులు, చారణులు దాన్ని సేవిస్తారు. ఆ సనాతన ద్వీపం జంబూద్వీపంగా పేరొందింది. (20)
యోజనానాం సహస్రం చ శతం చ భరతర్షభ ।
ఉత్సేధో వృక్షరాజస్య దివస్పృక్ మనుజేశ్వర ॥ 21
భరతర్షభా! నరాధిపా! ఆ చెట్టు ఎత్తు పదకొండు వందల యోజనాలు ఉంటుంది. అది ఆకాశం అంటుతున్నట్లు ఉంటుంది. (21)
అరత్నీనాం సహస్రం చ శతాని దశ పంచ చ ।
పరిణాహస్తు వృక్షస్య ఫలానాం రసభేదినామ్ ॥ 22
దాని వైశాల్యం రెండు వేల అరత్నులు ఉంటుంది. రసంచిప్పిలుతున్న ఫలాల వైశాల్యం అయిదు అరత్నులు ఉంటుంది. (22)
వి॥ అరత్ని = మణికట్టు నుండి చిటికెన వ్రేలు చివరి వరకు.
పతమానాని తాన్యుర్వీం కుర్వంతి విపులం స్వనమ్ ।
ముంచంతి చ రసం రాజన్ తస్మిన్ రజతసంనిభమ్ ॥ 23
రాజా! ఆ పళ్లు భూమి మీద పడుతుంటే పెద్ద ధ్వని వస్తుంది. వాటి నుండి బంగారు రంగులో రసం వస్తుంది. (23)
తస్యా జంబ్వాః ఫలరసః నదీ భూత్వా జనాధిప ।
మేరుం ప్రదక్షిణం కృత్వా సంప్రయాత్యుత్తరాన్ కురూన్ ॥ 24
రాజా! ఆ జంబూ ఫలాల రసం నదిలా అయి, మేరువు చుట్టూ తిరిగి ఉత్తర కురువర్షానికి వెళుతుంది. (24)
తత్ర తేషాం మనఃశాంతిః న పిపాపా జనాధిప ।
తస్మిన్ ఫలరసే పీతే న జరా బాధతే చ తాన్ ॥ 25
జనాధిపా! అక్కడున్న ప్రజలకు దాహం ఉండదు - చక్కని మనశ్శాంతి ఉంటుంది. ఆ పళ్ల రసం త్రాగిన వారిని ముసలితనం కూడా బాధించదు. (25)
తత్ర జాంబూనదం నామ కనకం దేవభూషణమ్ ।
ఇంద్రగోపకసంకాశం జాయతే భాస్వరం తు తత్ ॥ 26
అక్కడ జాంబూనదం అనే పేరు గల బంగారం పుడుతుంది. అది దేవతలకు భూషణంగా ఉపయోగిస్తుంది. ఆ బంగారం ఆర్ద్రపురుగులవలె ఎర్రని కాంతితో ఉంటుంది. (26)
తరుణాదిత్యవర్ణాశ్చ జాయంతే తత్ర మానవాః ।
తథా మాల్యవతః శృంగే దృశ్యతే హవ్యవాట్ సదా ॥ 27
అక్కడి మానవులు లేతసూర్యుని కాంతితో పుడతారు. అలాగే మాల్యవత్పర్వతం మీద అగ్ని జలిస్తూ ఉంటాడు. (27)
నామ్నా సంవర్తకో నామ కాలాగ్నిర్భరతర్షభ ।
తథా మాల్యవతః శృంగే పూర్వపూర్వానుగండికా ॥ 28
భరతశ్రేష్ఠా! అక్కడ సంవర్తకం కాలాగ్ని అనే పేర అగ్ని ప్రసిద్ధి వహించింది. ఆ మాల్యవత్ పర్వతశృంగం మీద తూర్పున చిన్న చిన్న గుట్టలు ఉంటాయి. (28)
యోజనానాం సహస్రాణి పంచషణ్మాల్యవానథ ।
మహారజతసంకాశాః జాయంతే తత్ర మానవాః ॥ 29
ఆ మాల్యవంతం విస్తారం అయిదారువేల యోజనాలుంటుంది. అక్కడ బంగారు రంగుకల మానవులు పుడతారు. (29)
బ్రహ్మలోకచ్యుతాః సర్వే సర్వే సర్వేషు సాధవః ।
తపస్తప్యంతి తే తీవ్రం భవంతి హ్యూర్ధ్వరేతసః ।
రక్షణార్థం తు భూతానాం ప్రవిశంతే దివాకరమ్ ॥ 30
వారంతా బ్రహ్మలోకం నుండి క్రిందికి వచ్చిన సాధువర్తనులు. వారు ఊర్ధ్వరేతస్కులై ప్రాణి సంరక్షణం కోసం తీవ్ర తపస్సు చేసి, మళ్లీ సూర్యునిలో ప్రవేశిస్తారు. (30)
షష్టిస్తాని సహస్రాణి షష్టిమేవ శతాని చ ।
అరుణస్యాగ్రతో యాంతి పరివార్య దివాకరమ్ ॥ 31
వారు అరవై ఆరు వేల మంది సూర్యుని చుట్టూరా ఉండి అరుణునికి ముందు భాగాన వెళుతూ ఉంటారు. (31)
షష్టిం వర్షసహస్రాణి షష్టిమేవ శతాని చ ।
ఆదిత్యతాపతప్తాస్తే విశంతి శశిమండలమ్ ॥ 32
వారు అరవై ఆరువేల సంవత్సరాలు సూర్యుని వేడిమితో తపించి, చివరకు చంద్రమండలంలో ప్రవేశిస్తారు. (32)
వి॥ సం॥ సూత్రాత్మభావం పొందుతారు. (నీల)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి మాల్యవద్వర్ణనే సప్తమోఽధ్యాయః ॥ 7 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున జంబూఖండవినిర్మాణ పర్వమను ఉపపర్వమున మాల్యవత్పర్వత వర్ణనమను ఏడవ అధ్యాయము. (7)